News November 21, 2024

జగన్ నిర్వాకంతో రూ.5వేల కోట్ల ప్రజాధనం ఆవిరి: సోమిరెడ్డి

image

గత ప్రభుత్వం హయాంలో YS జగన్ తన హంగులు, ఆర్భాటాల కోసం ఏకంగా రూ.5 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పాసు పుస్తకాలపై బొమ్మలు, రుషికొండ ప్యాలెస్ నిర్మాణంతో ప్రజల సొమ్మును జగన్ మంచి నీళ్లలా ఖర్చు చేశారని మండిపడ్డారు. జగన్ నిర్వాకంతో ప్రజలకు బడ్జెట్ మీద ఆశలు పోయాయన్నారు. అందుకే YCPని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 19, 2025

నెల్లూరు జిల్లాలో వేగంగా MSME పార్కులు

image

సీఎం చంద్రబాబు విజన్-2047లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ లేదా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆత్మకూరు నారంపేటలో పారిశ్రామికవాడ, నెల్లూరు అర్బన్‌ భగత్‌సింగ్ కాలనీలో రూ.12 కోట్లతో జీ+2 ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుండగా, ఆమంచర్లలో 59 ఎకరాల్లో MSME పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపాదన దశలో ఉన్నాయి.

News September 19, 2025

నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News September 19, 2025

‘విజయ’ సీటు కోసం వార్..!

image

నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. 14 ఏళ్లుగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న రంగారెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కీలకమైన ఈ పోస్టు కోసం సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు పోటీపడుతున్నారు. మొదట సర్వేపల్లికి చెందిన బాబిరెడ్డి పేరు దాదాపు ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ కోవూరు, ఆత్మకూరు నేతలు తీవ్రపోటీ ఇస్తున్నారు. ఫైనల్‌గా అదృష్టం ఎవరిని వరిస్తుందో..?