News April 7, 2025

జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

image

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 17, 2025

చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

image

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.

News September 17, 2025

వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేసి నేలకొరిగిన మొగిలయ్య

image

వరంగల్ కోట నివాసి మొగిలయ్య మొదటి నుంచి తెలంగాణ విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఉద్యమంలో భాగంగా సర్వోదయ సంఘం పక్షాన ప్రతివారం వరంగల్ కోటలో జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. 1946 ఆగస్టు 11న కోటలో జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత కాశీం షరీఫ్ నాయకత్వంలో రజాకార్లు హఠాత్తుగా దాడి చేశారు. కత్తిపోట్లకు గురై మొగిలయ్య నేలకొరిగాడు.

News September 17, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయుల శిక్షణ వాయిదా

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నేటి నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఉపాధ్యాయులందరూ గమనించాలని సూచించారు.