News July 10, 2025
జగన్ పర్యటనపై మూడు కేసుల నమోదు

జగన్ బంగారపాళ్యం పర్యటనలో మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు షో చేశారంటూ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు కుమార్ రాజా, పాలేరు రామచంద్రారెడ్డిపై కేసు పెట్టారు. రోడ్డుపై మామిడి కాయలు పోసిన డ్రైవర్లపై మరో కేసు నమోదు కాగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్పై దాడి చేసినట్లు మరోకేసు పెట్టారు.
Similar News
News July 10, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు సంబంధించిన బడ్జెట్ను విడుదల చేస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాకు రూ.46,71,612 విడుదల చేశారని, త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
News July 10, 2025
పెద్దపల్లి: యాక్సిడెంట్లో RTC డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో RTC డ్రైవర్ మృతిచెందిన ఘటన పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) ఇదులాపూర్ వద్ద గురువారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఔట్ సోర్స్ RTC డ్రైవర్గా విధులు ముగించుకున్న తోట శ్రీకాంత్(32) బుధవారం రాత్రి బైక్పై జాఫర్ఖాన్పేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరో బైక్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News July 10, 2025
కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్ను అడిగి తెలుసుకున్నారు.