News September 3, 2025
జగన్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు

YSR వర్ధంతి వేడుకలకు, జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం YS జగన్ పర్యటనలో మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు ప్రత్యేకంగా నిలిచింది. మంగళవారం ఉదయం జగన్ పులివెందుల పర్యటనలో ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అని మహిళలు ప్లకార్డును ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు వైపు జగన్ ఆసక్తిగా చూశారు.
Similar News
News September 3, 2025
AUTO MATE యాప్ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.
News September 3, 2025
AUTO MATE యాప్ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.
News September 3, 2025
బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.