News August 23, 2025
జగిత్యాలలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

ఈశా గ్రామోత్సవం పేరిట ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవాన్ని ఈనెల 23, 24న జగిత్యాల మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు తెలిపారు. పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీలలో తమ జట్లను ఉచితంగా నమోదు చేసుకుని పాల్గొనాలన్నారు. గెలిచిన మొదటి 4 జట్లకు నగదు బహుమతి ఉంటుందన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 21న ఈషా యోగ సెంటర్ కోయంబత్తూర్ లో జరుగుతుందన్నారు.
Similar News
News April 14, 2026
మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
News April 14, 2026
మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
News April 14, 2026
కలెక్టరేట్లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.


