News August 23, 2025
జగిత్యాలలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

ఈశా గ్రామోత్సవం పేరిట ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవాన్ని ఈనెల 23, 24న జగిత్యాల మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు తెలిపారు. పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీలలో తమ జట్లను ఉచితంగా నమోదు చేసుకుని పాల్గొనాలన్నారు. గెలిచిన మొదటి 4 జట్లకు నగదు బహుమతి ఉంటుందన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 21న ఈషా యోగ సెంటర్ కోయంబత్తూర్ లో జరుగుతుందన్నారు.
Similar News
News August 23, 2025
మెదక్: నాడు విద్యార్థి.. నేడు గెజిటెడ్ హెచ్ఎం

మెదక్ మండలం మాచవరం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా వై. సుకన్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హవేలిఘనపూర్ మండలం కూచన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన ఆమె పదోన్నతిపై వెళ్లారు. అయితే ర్యాలమడుగు గ్రామానికి చెందిన సుకన్య మాచవరం పాఠశాలలోనే చదువుకున్నారు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
News August 23, 2025
మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ ప్రావీణ్య

వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 23, 2025
ములుగు జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా 18-45 ఏళ్ల ఉన్న నిరుద్యోగ యువతకు హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వరంగల్ జిల్లా హసన్పర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని కార్యాలయంలో ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సూచించారు.