News September 7, 2025

జగిత్యాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

image

జగిత్యాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని మంత్రి కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు తమ సేవలకు గుర్తింపు పొందినందుకు అభినందనలు తెలిపారు.

Similar News

News September 7, 2025

మెదక్: రేపు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం

image

మెదక్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురణ, సంబంధించిన అంశాలపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. వివిధ ‌రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ ఈ సమావేశానికి సకాలంలో తప్పక హాజరుకావాలని సూచించారు.

News September 7, 2025

రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.

News September 7, 2025

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..

image

నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్-9 మొదలైంది. తొలి కంటెస్టెంట్‌గా తనూజ(ముద్దమందారం) హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆశా/ఫ్లోరా సైనీ(సినీ నటి), కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, సామాన్యుల కోటాలో పడాల పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని నాగార్జున తెలిపారు. సామాన్యులుvsసెలబ్రిటీలుగా షో సాగే అవకాశం ఉంది. ఈ సారి 15 మందికిపైగా కంటెస్టెంట్లు ఉండనున్నట్లు సమాచారం.