News February 2, 2026
జగిత్యాలలో పొలిటికల్ వార్.. నేతల వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం

మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాలలో పొలిటికల్ వార్ మొదలైంది. MLC బల్మూరి వెంకట్ శనివారం జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్లతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటి పోరాదని హెచ్చరించారు. అలాగే ఎంపీ అరవింద్ జగిత్యాలలో ఎన్నికల శంఖారావంలో పాల్గొని జీవన్ రెడ్డిని వేధించడం సరికాదని, అలాగే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేయడం పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచింది.
Similar News
News February 2, 2026
మత్స్యకారులకు బడ్జెట్లో భరోసా

మత్స్యకారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. భారత నౌకలు అంతర్జాతీయ జలాల్లో వేటాడే చేపలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఇది డీప్సీ ఫిషింగ్ చేసే బోటు యజమానులకు ఊరటగా చెప్పవచ్చు. అలాగే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్లో వాడే ముడిసరుకుల దిగుమతి సుంకం మినహాయింపు పరిమితిని 1% నుంచి 3%కు పెంచారు. ఇది ఆక్వా పరిశ్రమలకు లాభదాయకం.
News February 2, 2026
చలికాలంలో జుట్టు ఊడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి కేశాల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తలస్నానానికి గోరువెచ్చని నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ అప్లై చేయడం మరచిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయర్ వాడటం తగ్గించాలి. ఈ సీజన్లో తల వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. దీని వల్ల తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
News February 2, 2026
కర్నూల్: 46 ఏళ్లకు ఒక్కటయ్యారు

1979-80 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల తర్వాత కర్నూలులో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మృతిచెందిన 15 మంది మిత్రులకు నివాళులు అర్పించారు. విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఉమ్మరాజు, చిన్న ఓబులేశు గౌడు రచించిన ‘శ్రీ శిర్డీ సాయి స్తోత్ర శతకం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.


