News April 14, 2025
జగిత్యాల: అంబేడ్కర్కు ఘన నివాళులు

భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తహసిల్ చౌరస్తాలో విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్, అదనపు కలెక్టర్ లత, సంఘ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
KMR: జెండా ఎగరవేసిన ఎస్పీ

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే విజయాన్ని సాధించగలమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు.
News September 17, 2025
భూమనకు నోటీసుల అందజేత

తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా భూమన కరుణాకరరెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు అందడంతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో భూమన ఇంటికి ఎస్ఐ అజిత వెళ్లి నోటీసులు అందజేశారు. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారని ఆరోపించారు. ఏమాత్రం అవగాహన లేకుండా TTD అధికారి తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.
News September 17, 2025
కామారెడ్డి: వరద సహాయక చర్యల్లో పోలీసుల అద్భుత ప్రతిభ

ఇటీవల KMR జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 800 మందికి పైగా ప్రజలను త్వరితగతిన రక్షించిన పోలీసు శాఖ ధైర్య సాహసాలను రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ప్రశంసించారు. కామారెడ్డిలో బుధవారం జరిగిన ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జిల్లాను నేర రహిత సమాజంగా మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన కోరారు.