News September 23, 2025

జగిత్యాల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తుల గడవు పెంపు

image

అంబేడ్కర్ ఓవర్సీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 23 నుండి నవంబర్ 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి రూ.20 లక్షల స్కాలర్షిప్ అందించడం జరుగుతుందన్నారు.

Similar News

News September 24, 2025

ఆరోగ్య సమస్యలు.. అవసరమైన విటమిన్లు

image

* అలసటగా ఉంటే విటమిన్ B12, *రోగనిరోధక శక్తి కోసం విటమిన్ C, * జుట్టు పలచబడితే బయోటిన్ (B7), * పొడి చర్మం ఉంటే విటమిన్ E, *తరచుగా జలుబు వస్తుంటే విటమిన్ D, *కండరాల తిమ్మిరి అనిపిస్తే మెగ్నీషియం + విటమిన్ D, *రాత్రి సరిగా కనిపించకపోతే విటమిన్ A, *గాయాలు నెమ్మదిగా మానితే విటమిన్ C + జింక్, *మూడ్ స్వింగ్స్ / ఆందోళనగా ఉంటే విటమిన్ B6 + మెగ్నీషియం, *కీళ్ల దృఢత్వానికి విటమిన్ D + K2. SHARE IT

News September 24, 2025

జగిత్యాల: ఎకానమిక్ సపోర్ట్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

image

JGTL జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 24-25 ఆర్థిక సంవత్సరానికి ఎకానమిక్ సపోర్ట్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. ఫకీర్, దూదేకుల, దుర్బల ముస్లిం కమ్యూనిటీ వర్గాల వారు అర్హులన్నారు. రూ.1 లక్ష గల మోపెడ్లు, బైక్‌లు, ఈ-బైక్‌లు లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా OCT 6 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 24, 2025

రేపు విజయవాడకు ఉపరాష్ట్రపతి రాక

image

AP: వైస్ ప్రెసిడెంట్ C.P రాధాకృష్ణన్, ఆయన సతీమణి సుమతి బుధవారం మధ్యాహ్నం విజయవాడకు రానున్నారు. విమానాశ్రయంలో CM చంద్రబాబు వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం జరిగే విజయవాడ ఉత్సవ్‌లో చీఫ్ గెస్టుగా పాల్గొంటారు. అనంతరం IAF ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు.