News February 16, 2025
జగిత్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లాలో అర్హత ఉన్న నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శనివారం కలెక్టర్లో గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈడీఈ, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్డీవో రఘువరన్ ఉన్నారు.
Similar News
News September 18, 2025
శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News September 18, 2025
ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.
News September 18, 2025
తల్లిదండ్రులకు సత్వర న్యాయం చేయాలి: జగిత్యాల కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగుల & వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను విస్మరించే కుమారులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.