News March 6, 2025
జగిత్యాల: ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్ రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.
News November 14, 2025
వంటింటి చిట్కాలు

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.
News November 14, 2025
45 వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్

ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. జూబ్లీహిల్స్లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని ఆశించారు. 45 వేల మెజారిటీతో గెలుస్తున్నామని నవీన్ యాదవ్ తెలిపారు. అయితే, ఆయన ఆశించిన స్థాయిలోనే 4 రౌండ్లలో INC లీడ్లో ఉంది.


