News December 17, 2025

జగిత్యాల: ఎంతమంది థర్డ్ జెండర్లు ఓటు వేశారో తెలుసా..?

image

జిల్లాలోని 20 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే థర్డ్ జెండర్లు ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో మెట్పల్లిలో ఒకరు, JGTLరూరల్లో ఇద్దరు, మల్యాలలో ఇద్దరు, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఒక్కరి చొప్పున థర్డ్ జెండర్లు ఓటుహక్కు కలిగి ఉన్నారు. అయితే ఇటీవల 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కేవలం ఎండపల్లి మండలంలో ఉన్న ఒకే ఒక థర్డ్ జెండర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Similar News

News December 18, 2025

20న గుణదలలో జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న గుణదలలో సీనియర్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా ఒరిజినల్ ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా కరేడులో డిసెంబర్ 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.

News December 18, 2025

రేపు ఒంగోలులో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఆవరణంలో 19న శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను వైజ్ఞానిక పరంగా ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రదర్శన అనంతరం సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు.

News December 18, 2025

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మల, గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్, సర్బానందలతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి తిరిగి APకి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి అనకాపల్లిలో పర్యటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.