News December 2, 2025
జగిత్యాల: ‘ఎన్నికల ఖర్చుల్లో తేడాలు లేకుండా చూడాలి’

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యయపరిశీలకులు మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల నమోదు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఖర్చుల వివరాల్లో ఎలాంటి తేడాలు లేకుండా ప్రతిఅంశాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 13, 2026
అనకాపల్లి చేరిన రామతీర్థం రాములోరి శోభాయాత్ర

విజయనగరం జిల్లా రామతీర్థం నుంచి బయలుదేరిన శోభాయాత్ర అనకాపల్లి బైపాస్ రోడ్డు తోటాడ జంక్షన్ వద్దకు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానం తరపున దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు, 50 మంది భక్తుల సమక్షంలో శ్రీరాములవారి జీర్ణోద్ధారణ నిమర్జన మహోత్సవం నిర్వహిం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం ఛైర్మన్ పీలా నాగ శ్రీను, డిప్యూటీ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.
News April 13, 2026
వనపర్తి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వనపర్తి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా వీపనగండ్లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దగడ, పెద్దమందడి, పానుగల్తో పాటు పలు మండలాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 13, 2026
అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

లోక్సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.


