News February 28, 2025
జగిత్యాల ఎమ్మెల్యే ఆదేశాలు

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నుకపల్లి కాలనీలో లబ్ధిదారులకు మంజూరైన డబల్ బెడ్ రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ లు, ట్రాన్స్ ఫార్మర్ లు, సెప్టిక్ ట్యాంక్, నీళ్ళ వసతి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశించారు. ప్రజల సహకారంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News February 28, 2025
హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్ను నిలిపివేసిందని ఆరోపించారు.
News February 28, 2025
ఎడపల్లి: గేదెలను కడగడానికి వెళ్లి వ్యక్తి మృతి

ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
News February 28, 2025
చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.