News March 13, 2026
జగిత్యాల: ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతుల తనిఖీ

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్సీ పరీక్షల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము తనిఖీ చేశారు. పరీక్షల కోసం సిద్ధం చేసిన తరగతి గదులు, తాగునీటి సదుపాయం, వెంటిలేషన్, విద్యుత్ సౌకర్యం, మూత్రశాలల శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
Similar News
News April 13, 2026
పబ్లిక్ గార్డెన్లో రేపు అంబేడ్కర్ సినిమా ప్రదర్శన

నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో రేపు (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బయోపిక్ ప్రదర్శించనున్నారు. తెలుగు లలితకళా తోరణంలో ఈ ప్రదర్శన ఉంటుంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని సాంస్కతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News April 13, 2026
భారత్ చేరుకున్న ఇరాన్ నౌకలు

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్ చేరుకున్నాయి. గుజరాత్లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.
News April 13, 2026
HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.


