News July 8, 2025

జగిత్యాల: కుటుంబ సభ్యులే కాలయముళ్లు!

image

జగిత్యాల జిల్లా కోరుట్లలో గతంలో జరిగిన దీప్తి హత్య కేసులో, మొన్న జరిగిన చిన్నారి హితీక్ష హత్య కేసులో రక్త సంభందికులే హంతకులుగా తేలారు. ఈ రెండు హత్యకేసులు అప్పుడు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. దీప్తి హత్య కేసులో సొంత చెల్లెలు చందన, ఆమె ప్రియుడు ఉమర్ నేరస్థులు కాగా, హితీక్ష హత్య కేసులో పిన్నీ(బాబాయి భార్య) మమత హంతకురాలు అయ్యింది.

Similar News

News July 8, 2025

ఏటూరునాగారం: ప్రభుత్వ భూమిని పరిశీలించిన కలెక్టర్

image

ఏటూరునాగారం మండలం ఎక్కేలా గ్రామంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం పర్యటించారు. గోదావరి వరద ప్రవాహం ముంపునకు గురయ్యే భూటారం ప్రజల కోసం ఎక్కేలా గ్రామంలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వీలైనంత త్వరగా స్థలాన్ని పరిశీలించి, నివేదికను అందించాలని కలెక్టర్ తహశీల్దార్‌కు సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మహేందర్ ఉన్నారు.

News July 8, 2025

TTD ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్

image

AP: TTDలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) రాజశేఖర్ బాబు సస్పెండ్ అయ్యారు. తిరుపతి(D)లోని స్వగ్రామం పుత్తూరులో ఆయన ప్రతి ఆదివారం చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని TTDకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన TTD విజిలెన్స్ అధికారులు రాజశేఖర్ ఆలయ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని గుర్తించారు. ఇతర ఆధారాలూ పరిశీలించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేశారు.

News July 8, 2025

తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.