News January 14, 2026

జగిత్యాల: కేంద్రానికి స్పీడ్ పోస్టుల వినతులు

image

పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ.. 2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తమ గోడును వినిపించేందుకు ‘స్పీడ్ పోస్టు’ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రాలు పంపినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

ఉపాధి బిల్లుల నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదును నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.77.46 కోట్లు మాత్రమే అప్లోడ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన బిల్లులను వెంటనే నమోదు చేసి లక్ష్యాలు సాధించాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు రోజువారీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు.

News February 16, 2026

నిరుద్యోగ యువతకు మత్స్యశాఖ గుడ్‌న్యూస్

image

జిల్లా నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ యూనిట్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 19 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో జనరల్ కేటగిరీకి 13 యూనిట్లు, మహిళలకు 2, ఎస్సీ వర్గానికి 3, ఎస్టీ వర్గానికి 1 కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

News February 16, 2026

PM RAHAT స్కీమ్.. వివరాలివే

image

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు కేంద్రం PM RAHAT స్కీమ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కింద ₹1.5లక్షల వరకు ఉచిత(క్యాష్‌లెస్) చికిత్స అందనుంది. ప్రమాదం జరిగిన 7days వరకు ఇది వర్తిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎమర్జెన్సీ నంబర్(112)కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి బాధితుల్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుంది. ఈ పథకానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.