News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News January 1, 2026
క్షయ వ్యాధి రహిత జిల్లానే లక్ష్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాను క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పెనుకొండ టీబీ యూనిట్ పరిధిలోని 10 మంది టీబీ రోగులను ‘నిక్షయ్ మిత్ర’ పథకం కింద దత్తత తీసుకున్నారు. వారికి అవసరమైన పోషకాహార కిట్లను కలెక్టర్ అందజేశారు.
News January 1, 2026
పెన్షనర్లకు అలర్ట్.. ఫిబ్రవరిలోగా లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి!

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని డీటీఓ ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం RJY జిల్లా ఖజానా కార్యాలయంలో ఈ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. గడువులోగా ధ్రువీకరణ పత్రాలు అందజేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News January 1, 2026
విశాఖలో భారీగా కేసుల నమోదు

నగరంలోని బుధవారం సాయంత్రం నుంచి 83 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 2,721 వాహనాలు తనిఖీ చేయగా బహిరంగ మద్యం కేసులు 99, మోటార్ వెహికల్ కేసులు 644, హెల్మెట్ ధరించని కేసుు 506, త్రిబుల్ రైడింగ్ 34, డ్రంక్ అండ్ డ్రైవ్ 257, ఇతర మోటర్ వెహికల్ కేసులు 103 నమోదు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. గురువారం కూడా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


