News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News January 6, 2026
UPDATE: కామారెడ్డి.. ఏసీబీ వలలో తహశీల్దార్

జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. నాగిరెడ్డిపేట తహశీల్దార్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం కలకలం రేపింది. తాండూరు వాసి తన పని నిమిత్తం MROను సంప్రదించగా, ఆ పని పూర్తి చేయడానికి శ్రీనివాస్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. మంగళవారం బాధితుడి నుంచి శ్రీనివాస్ రూ.10 వేలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
News January 6, 2026
ADB: 11 మంది టీజీఎస్పీ సిబ్బంది కన్వర్షన్

విధుల నిర్వహణను అంకితభావంతో, క్రమశిక్షణతో చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టీజీఎస్పీ (తెలంగాణ స్పెషల్ పోలీస్) నుంచి వివిధ బెటాలియన్ల పరిధిలో విధులు నిర్వర్తించి ఆదిలాబాద్ జిల్లా సాయుధ విభాగానికి 11 మంది మంగళవారం బదిలీ అయ్యారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. RI వెంకటి, సీసీ కొండరాజు పాల్గొన్నారు.
News January 6, 2026
VZM: డీలర్ల సమస్యలపై మంత్రి నాదెండ్లకు వినతి

రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాను పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. క్వింటాకు రూ.300 కమిషన్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువుల అమ్మకాలకు అనుమతి, 60 సంవత్సరాలు దాటిన డీలర్లకు పెన్షన్, రుణ మాఫీ వంటి ప్రధాన అంశాలను వివరించారు. మంత్రి వినతిని స్వీకరించి సానుకూలంగా స్పందించారు.


