News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News January 8, 2026
ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.
News January 8, 2026
పల్నాడు జిల్లాకు మణిహారంగా అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా నవ నగరాలు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాకు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించనుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో భూ సమీకరణ ప్రారంభం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయం వెల్లడించారు. 7,465 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పల్నాడు జిల్లాకు స్పోర్ట్స్ సిటీ మణిహారం కానుంది.
News January 8, 2026
‘సమవర్తి’ చిత్రంలో బండి ఆత్మకూరు వాసి

పంచభూత ప్రొడక్షన్ నిర్మిస్తున్న ‘సమవర్తి’ చిత్రంలో కథానాయకుడిగా సత్యదేవ నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం గత నెలలో బేతంచెర్ల మండలం బిల్వస్వర్గం గుహలలో కొన్ని సన్నివేశాలను రూపొందించింది. గిరిజన వేషధారణలో నటించినట్లు బండి ఆత్మకూరు(M) పెద్దదేవలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర నాయక్ తెలిపారు. గతంలో భారతీయుడు-2, రంగస్వామి, సిద్ధన గట్టు.. పలు చిత్రాలలో నటించినట్లు వెల్లడించారు.


