News November 15, 2025

జగిత్యాల: ‘గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా’

image

భగవాన్ బిర్సా 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత మాట్లాడుతూ.. బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ‘ధర్తీ ఆబా’గా ప్రజల హక్కులు, గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

21న జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఈనెల 21న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. కాకినాడ జడ్పీ కార్యాలయ హాలులో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాలకు అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన శనివారం ఆదేశించారు.

News November 15, 2025

పేలుడు పదార్థాల్లో రసాయనిక చర్యతోనే భారీ బ్లాస్టింగ్!

image

J&K నౌగామ్ పోలీసు స్టేషన్లో భారీ బ్లాస్టింగ్‌ ఉగ్రదాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఫరీదాబాద్‌(హరియాణా)లో వైట్‌కాలర్ టెర్రరిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న360 KGల కెమికల్ పేలుడు పదార్థాల్లో అత్యధిక భాగం ఈ PSలోనే ఉంచారు. శుక్రవారం రాత్రి వీటి నుంచి శాంపిల్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు PTI పేర్కొంది. ఘటనలో 9 మంది మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. PS తునాతునకలైంది.

News November 15, 2025

KMR: అంతర్రాష్ట్ర ముఠా నిందితుడిపై PD యాక్ట్ అమలు

image

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై KMR పోలీస్ ఉక్కుపాదం మోపింది. ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు భాస్కర్ భాపురావ్ చవాన్‌పై కలెక్టర్ ఆదేశాల మేరకు PD యాక్ట్ అమలు చేశారు. అతనిపై KMR, NZB, NRML జిల్లాల్లో 14 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ముఠాలోని మరో ముగ్గురిపై PD యాక్ట్ అమలు చేశారు. ప్రజల్లో భయం సృష్టిస్తున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు.