News February 4, 2025
జగిత్యాల: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 కు గాను అన్ని గురుకులాలలో 5 నుంచి 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించిందని జగిత్యాల జిల్లా సమన్వయ, నోడల్ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈనెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయన్నారు.
Similar News
News September 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్
> రాష్ట్రీయ పోషణ్ మహ్ 2005 విజయవంతం చేయాలి: కలెక్టర్
> చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
> జిల్లా వ్యాప్తంగా విహెచ్పిఎస్ నేతల ధర్నా
> వాడి వేడిగా కొనసాగిన తాటికొండ రాజయ్య పాదయాత్ర
> చెక్కులను పంపిణీ చేసిన MLA యశస్విని రెడ్డి
> దిక్సూచి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
> పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట
News September 15, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు
News September 15, 2025
NRPT: ‘ANMలను NCD ఆన్లైన్ ప్రోగ్రామ్ నుంచి తొలగించాలి’

ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రామ్ నుంచి ఏఎన్ఎం (ANM)లను తొలగించాలని కోరుతూ సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్కు ఏఎన్ఎంలు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి మాట్లాడుతూ.. ఆన్లైన్ ప్రోగ్రామ్ వల్ల ఏఎన్ఎంలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజుకు 12 గంటల సమయం దీనికే సరిపోతోందని తెలిపారు. దీనివల్ల ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు.