News March 11, 2025

జగిత్యాల :గ్రీవెన్స్ డే లో 14 అర్జీదారులు

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు అర్జీదారుల సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

Similar News

News February 2, 2026

రష్యా దాడిలో 15 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

image

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్ అటాక్‌లో 15 మంది మరణించారు. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని DTEK విద్యుత్ ఉత్పత్తి సంస్థ గనులపై రష్యా దాడులకు పాల్పడింది. షిఫ్ట్ ముగించుకొని బస్సులో ఇంటికి బయల్దేరిన కార్మికులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అబుదాబీ వేదికగా FEB 4,5 తేదీల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.

News February 2, 2026

కర్నూలు: ‘30 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

వెల్దుర్తి మండలం కలగొట్ల జడ్పీహెచ్ పాఠశాలలో 1995-96లో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కల్లూరు ఎంఈవో శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు మునీశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి పాల్గొని సూచనలు చేశారు.

News February 2, 2026

ఖమ్మం కమిషనరేట్‌లో పోలీస్‌ యాక్ట్‌ అమలు

image

ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈనెల 28వ తేదీ వరకు సిటీ పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ సునీల్‌ దత్‌ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు.