News January 8, 2026
జగిత్యాల: ‘జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు’

దేశంలో న్యాయం కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు, న్యాయవాదులకు తగిన రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హైకోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. గురువారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు దేశానికి నాలుగో స్తంభమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులు, న్యాయవాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఇద్దరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News January 9, 2026
TTD బోర్డు సభ్యత్వానికి జంగా రాజీనామా..?

TTD బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారన్న ప్రచారం నడుస్తోంది. తిరుమలలో ఈయనకు గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం TTD బోర్డ్ అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇది వరకే కోర్టు దీనిపై ఆదేశాలు సైతం ఇచ్చింది. దీనిపై కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 9, 2026
త్వరలో సూళ్లూరుపేటకు మహర్దశ.!

సూళ్లూరుపేట(M) బీవీపాలెం సమీపంలో దాదాపు 150 ఎకరాల్లో ఫ్లోటింగ్ వాటర్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఎకో-టూరిజంతో పాటు పులికాట్ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఈ టూరిజాన్ని PPP మోడల్లో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక టూరిజం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 పైచిలుకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
News January 9, 2026
రేవంత్ రైతులపై కక్షగట్టారు: హరీశ్రావు

TG: కరోనాలోనూ KCR రైతుబంధు అపలేదని మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట(D) నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సిద్దిపేటలో పూర్తిస్థాయిలో నూనె ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ అస్తవ్యస్తమైంది. యూరియా కోసం యాప్లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతోంది. వానాకాలం పంటలకు రూ.600కోట్ల బోనస్ పెండింగ్ పెట్టింది. రేవంత్ కావాలనే రైతులపై కక్షగట్టారు’ అని విమర్శించారు.


