News January 26, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

1.జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవం 2.జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పాఠశాలలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు 3.రేపు మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 4 పథకాల అమలు ప్రారంభ కార్యక్రమం 4.ముత్యంపేటలో ఇద్దరికీ కత్తిపోట్లు 5.మెట్పల్లి సిఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు 6.కొడిమ్యాలలో పెద్దపులి.. గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు 7.జగిత్యాల పాఠశాలలో విద్యార్థులతో స్వీపర్ పనులు
Similar News
News September 17, 2025
దత్తతతో దేశం దాటి.. మూలాల కోసం మళ్లీ వచ్చింది..!

దత్తతతో దేశం దాటిన మహిళ తన తల్లిదండ్రుల మూలాల కోసం మళ్లీ తిరిగి మాతృ దేశానికి వచ్చింది. వరంగల్ శివనగర్లో తన మూలాలు ఉన్నాయని గుర్తించి చివరకు తన తల్లిదండ్రులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 36 ఏళ్ల క్రితం సంధ్యారాణి అనే మహిళ దత్తతతో స్వీడన్ దేశానికి వెళ్లింది. పెరిగి పెద్దై ఉన్నత చదువుల్లో రాణించి 2009 నుంచి అన్వేషించింది. చివరకు తనది పద్మశాలి సామాజిక వర్గమని తెలుసుకుంది.
News September 17, 2025
GST సంస్కరణలతో వారికి మేలు: సత్యకుమార్

AP: జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి, పేదలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మార్పులతో ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. 2047నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రమిస్తోందన్నారు. గత ఐదేళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఎకానమీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని తెలిపారు.
News September 17, 2025
వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.