News March 28, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు!

@జిల్లాలోని నేటి 10వ తరగతి పరీక్షకు 7గురు గైర్హాజరు @ ధర్మపురి తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన@ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం @ ధర్మపురి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ@ పెగడపల్లి గ్రామపంచాయతీని తనిఖీ చేసిన మండల పంచాయతీ అధికారి@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్ర గర్భస్రావ సంరక్షణ శిక్షణ @ రాయికల్ లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
Similar News
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.
News March 31, 2025
గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
News March 31, 2025
కోనసీమ జిల్లాలో ఏప్రిల్ 2నుంచి ఉచిత కోచింగ్

జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుంది. ఆలమూరు, కొత్తపేట, కాట్రేనికోన, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో కోచింగ్ ఇస్తామని జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు సోమవారం తెలిపారు. పాలిటెక్నిక్, APRJC, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ గైడెన్స్పై పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.