News March 30, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@కలెక్టరేట్లో ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష సమావేశం @జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ఉగాది, రంజాన్ సంబురాలు @ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగిత్యాల MLA @రాయికల్‌లో పౌర హక్కుల దినోత్సవం @మెట్‌పల్లి ప్రభుత్వ కాలేజీలో మాదకద్రవ్య నిర్ములన పోస్టర్ ఆవిష్కరణ @బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి @మల్లాపూర్‌లో TDP జెండా ఆవిష్కరణ @కొండగట్టులో భక్తుల రద్దీ

Similar News

News April 1, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 1, 2025

నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్‌కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 1, 2025

ప.గో: రెండు రోజుల్లో 10 టన్నుల చికెన్ అమ్మకాలు

image

ప.గో జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో జిల్లాలో 10 టన్నులకు పైగా చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.

error: Content is protected !!