News February 5, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @కొడిమ్యాల లోని నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ @మల్యాలలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రూ.1,27,995 రూపాయల ఆదాయం @జగిత్యాల ఎమ్మెల్యేను కలిసిన దళిత సంఘ నాయకులు @బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం @ఇకనుంచి జగిత్యాల ఆర్టీసీ కార్గో సేవల్లో హోమ్ డెలివరీ
Similar News
News July 7, 2025
‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
News July 7, 2025
విజయనగరం జిల్లాలో కూలిన వంతెన

సంతకవిటి మండలం కొండగూడెం-ఖండ్యాం మధ్య సాయన్నగెడ్డపై ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీనితో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, బూర్జ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
News July 7, 2025
సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.