News February 15, 2025

జగిత్యాల: జిల్లాలోని 50 PACS పాలకవర్గాల గడువు పొడిగింపు

image

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు రేపటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం పాలక వర్గాల గడువును 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. JGTL జిల్లాలో 50 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రస్తుత పాలకవర్గాలకు మరో 6 నెలల పాటు అవకాశం లభించింది. ప్రస్తుత PACSల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఆయా సంఘాల ఛైర్మన్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతారు.

Similar News

News November 9, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ నల్గొండ : హైవే విస్తరణ… అభివృద్ధికి కొత్త మార్గం
→ నల్గొండ : కూరగాయలు కొనేటట్లు లేదు..!
→ నల్గొండ : ఇక్కడి నాయకులంతా అక్కడే…!
→ చిట్యాల : గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా?
→ నల్గొండ : బోగస్ ఓట్లకు చెక్
→ నేరేడుచర్ల : గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం
→ నార్కట్ పల్లి : చెర్వుగట్టుకి పోటెత్తిన భక్తులు

News November 9, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓గుండాల: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
✓దమ్మపేట: అక్రమ కలప రవాణా ట్రాక్టర్ సీజ్
✓ఈనెల 19న మణుగూరులో జాబ్ మేళా: ఎమ్మెల్యే
✓చండ్రుగొండ: ఏ క్యా హై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో
✓కొత్తగూడెం: ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా శోధా కంపెనీ
✓అశ్వారావుపేట: పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు
✓రాజీయే రాజమార్గం.. 15న లోక్ అదాలత్: భద్రాద్రి జడ్జి

News November 9, 2025

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

image

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.