News February 11, 2026
జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఓటేశారంటే..?

జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 1,40,869 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో 9,547 మంది, జగిత్యాల మున్సిపాలిటీలో 55,795 మంది, కోరుట్ల మున్సిపాలిటీలో 39,111 మంది, మెట్ పల్లి మున్సిపాలిటీలో 28,075 మంది, రాయికల్ మున్సిపాలిటీలో 8,341 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనున్నది.
Similar News
News February 12, 2026
విశాఖ: ఫ్లైట్స్ షెడ్యూల్స్లో మార్పులు చూసుకున్నారా..!

విశాఖలో ఫిబ్రవరి 15-19 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026 నౌకాదళ విన్యాసాల నేపథ్యంలో విమానాశ్రయంలో షెడ్యూల్ను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. రోజూ ఉదయం 10.45-12.30, సాయంత్రం 4-5.30, 6.30-7.30 మధ్య వైమానిక మార్గం తాత్కాలికంగా మూసివేయనున్నారు. 16 విమానాల రాకపోకలు మారాయి. చెన్నై-విశాఖ-చెన్నై 6E581, 6E881 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
News February 12, 2026
5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్లు, వెబ్కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.
News February 12, 2026
అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.


