News March 26, 2025
జగిత్యాల జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని రోజులుగా చల్లగా ఉన్న వాతావరణం బుధవారం వేడెక్కింది. బుధవారం జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వెల్గటూర్, జగిత్యాల మండలాల్లో 36.6 డిగ్రీలు రాయికల్ మండలంలో 39.4, గొల్లపల్లిలో 39.2, బుగ్గారంలో 39.2, కోరుట్ల లో 39.2, మేడిపల్లిలో 39.1, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్ మండలాల్లో 39.1 భీమారంలో 39.0, మేడిపల్లి లో 39.1 ఉంది.
Similar News
News January 1, 2026
హెల్మెట్కు పాలస్తీనా జెండా.. JK11 ప్లేయర్ అరెస్ట్

పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడిన JK11 టీమ్ ప్లేయర్ ఫుర్కాన్ భట్ను జమ్మూ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ & కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్లో భాగంగా జమ్మూ ట్రయల్ బ్లేజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. లీగ్ నిర్వాహకుడు జహీద్ భట్ను కూడా విచారించనున్నారు.
News January 1, 2026
జగిత్యాల కలెక్టర్, అదనపు కలెక్టర్లకు న్యాయవాదుల శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ను గురువారం జిల్లా ప్రభుత్వ న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా అడిషనల్ కలెక్టర్లు బి.ఎస్.లత, బి.రాజగౌడ్లను కూడా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. జగిత్యాల ఏజీపీ బొగా ఓం ప్రకాష్, మెట్పల్లి ఏజీపీ అబ్దుల్ హఫీజ్, ధర్మపురి ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, కోరుట్ల ఏజీపీ గోనె రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.
News January 1, 2026
పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు KCR వచ్చేనా?

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని BRS చీఫ్ KCR ఇటీవల ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. KCRకు సమాధానమిచ్చేందుకు CM రేవంత్, మంత్రులు సన్నద్ధమయ్యారు. కాగా తొలిరోజు సభకు వచ్చిన KCR 3 ని.లలోనే వెళ్లిపోయారు. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే సభకు ఆయన వస్తారో లేదో సందిగ్ధంగా మారింది. సవాల్ విసిరి రాకపోతే ఒకింత నష్టమేనన్నభావన BRS వర్గాల్లో ఉంది.


