News April 11, 2025
జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం అల్లీపూర్లో అత్యధికంగా 40.9℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు జైన 40.8, మారేడుపల్లి 40.7, వెల్గటూర్, గోదూరు 40.5, ఐలాపూర్ 40.4, సారంగాపూర్, మెట్పల్లి 40.2, ధర్మపురి, మేడిపల్లి 40.1, రాయికల్ 40.0, ఎండపల్లి, మల్లాపూర్, సిరికొండ, నేరెల్ల, రాఘవపేటలో 39.4℃ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగానే ఉంది.
Similar News
News November 5, 2025
HYD: T-Hub దశాబ్దపు విజయం: KTR

5 NOV 2015న T-Hub ఆవిర్భావంతో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ భారతదేశపు స్టార్టప్ రాజధానిగా నిలిచిందని KTR ‘X’ లో పోస్ట్ చేశారు. T-Hubతో మొదలై We-Hub, T-Works వంటి సంస్థలతో కూడిన ఈ అద్భుతమైన ఎకోసిస్టమ్ను ‘ఆధునిక భారతదేశానికి ముఖచిత్రం’ అన్న రతన్ టాటా వ్యాఖ్యలను గుర్తుచేశారు. గత దశాబ్దంలో T-Hub సాధించిన ఈ ఘనత తనకు గర్వకారణమని రాసుకొచ్చారు.
News November 5, 2025
వికారాబాద్: పూడూరుకు ఇండియన్ క్రికెటర్

వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి ఈరోజు ఇండియన్ క్రికెటర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ వచ్చారు. పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతల్ గ్రామంలో తాను కొన్న 2.35 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. దీంతో మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను చూసేందుకు స్థానిక యువత MRO ఆఫీస్కు వచ్చారు. MRO విజయ్ కుమార్ సిరాజ్ను సన్మానించారు.
News November 5, 2025
చివరకు దళారులను ఆశ్రయించాల్సిందేనా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల, తాళ్లపల్లి, గాలిపెల్లిలోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి గరిష్ఠంగా ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనుండడంతో మిగతా పత్తిని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిందేనా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


