News February 9, 2025
జగిత్యాల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.
Similar News
News December 22, 2025
మంచిర్యాల: నేడు పల్లెల్లో కొలువుదీరనున్న పాలకవర్గాలు

మంచిర్యాల జిల్లాలోని 302 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రత్యేక అధికారుల సమక్షంలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎన్నికైన వారే అధికంగా ఉండటంతో, నిధుల కొరతను అధిగమించి అభివృద్ధి చేయడం వీరికి సవాల్గా మారింది. ప్రమాణ స్వీకారం రోజే తొలి సమావేశం నిర్వహించి పల్లె పాలనకు శ్రీకారం చుట్టనున్నారు.
News December 22, 2025
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య

హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. ‘It: Chapter Two’, ‘The Black Phone’ వంటి చిత్రాలతో పాటు పలు సిరీస్ల్లోనూ ఆయన నటించారు. ప్రముఖ టీవీ సిరీస్ ‘The Wire’లో జిగ్గీ సోబోట్కా పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో జన్మించిన రాన్సోన్ గత కొంతకాలంగా వ్యక్తిగత, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటి గురించి ఆయనే స్వయంగా పలుమార్లు తెలిపారు.
News December 22, 2025
100% సబ్సిడీతో ఆయిల్పామ్ మొక్కలు

AP: ఆయిల్పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100% సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు(2.47ఎకరాలు)కు దిగుమతి మొక్కలకు ₹29 వేలు, స్వదేశీ మొక్కలకు ₹20 వేలు ఇస్తోంది. బోర్వెల్కు ₹25 వేలు, మోటారుకు ₹10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్ ఏర్పాటుకు ₹20 వేలు అందజేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 2.49 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు.


