News March 11, 2025
జగిత్యాల జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు!

జగిత్యాల జిల్లాలో వరుస ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మార్చి 5న కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-3గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య ఏసిబికి చిక్కాడు. ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ మార్చి 6న ఏసీబీకి పట్టుబడ్డాడు. తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతిని మార్చి6న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
Similar News
News February 27, 2026
సీక్రెట్గా భారత్కు ట్రంప్ దూత!

గ్లోబల్ టారిఫ్స్ చెల్లవని కొట్టేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు భారతే వచ్చి ‘సారీ’ చెబుతుందన్న US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్ ఇప్పుడు స్వయంగా ఢిల్లీకి వచ్చి పీయూష్ గోయల్తో రహస్యంగా భేటీ అయ్యారు. కోర్టు తీర్పుతో ట్రంప్ బార్గెయినింగ్ పవర్ తగ్గడంతో భారత్ తన వాషింగ్టన్ పర్యటనను వాయిదా వేసి పట్టు సాధించింది. దీంతో కంగారుపడ్డ ట్రంప్ ‘గేమ్స్ ఆడకండి’ అని వార్నింగ్ ఇచ్చారు.
News February 27, 2026
ఇజ్రాయెల్కు అమెరికా స్టెల్త్ విమానాలు

ఇరాన్తో అణు చర్చల వేళ అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్డ్ F-22 రాప్టర్ స్టెల్త్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్కు పంపింది. బ్రిటన్ నుంచి బయలుదేరిన 12 విమానాలు ఇప్పటికే అక్కడ ల్యాండయ్యాయి. ఒకవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో చర్చలు సాగుతున్నా అమెరికా మాత్రం తన మిలిటరీ బలాన్ని పెంచుతూనే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్సామ్ను నిలువరించడమే లక్ష్యంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను మోహరించింది.
News February 27, 2026
నేడు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ ట్రయల్ రన్

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘రుద్రమ-1’ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు అసలైన ప్రయోగం ఉంటుందని, విద్యార్థులు, ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.


