News November 11, 2025

జగిత్యాల జిల్లాలో 100% ఆయుష్మాన్ భారత్ టార్గెట్

image

జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ అమలుపై అధికారులు సమీక్షించారు. జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 ఉప కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 3,48,605 మంది నమోదు కాగా 100% లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. ప్రజలకు సమయానుకూలంగా వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Similar News

News November 12, 2025

రాజ్‌కోట్ నుంచి మహబూబ్‌నగర్‌కు పీయూ ఎన్‌ఎస్‌ఎస్ బృందం

image

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్‌ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

News November 12, 2025

MBNR: ‘సైబర్ కేసులను త్వరగా పరిష్కరించండి’

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ ఎన్.బీ.రత్నం ఆదేశించారు. జిల్లా SP డి.జానకి ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన మంగళవారం సైబర్ వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో కేసులు పరిష్కరించే ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

News November 12, 2025

ఎల్లుండి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

image

AP: టెన్త్ పరీక్షల ఫీజును ఎల్లుండి(NOV 13) నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. రెగ్యులర్, ఒకేషనల్, గతంలో టెన్త్ ఫెయిలైన వారు ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. లేట్ ఫీ రూ.50తో డిసెంబర్ 3 వరకు, రూ.200తో డిసెంబర్ 10 వరకు, రూ.500తో డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. స్కూల్ హెడ్ మాస్టర్లు https://bse.ap.gov.in/లో స్కూల్ లాగిన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.