News March 18, 2025
జగిత్యాల జిల్లాలో 40.4 హయ్యెస్ట్ టెంపరేచర్

జగిత్యాల జిల్లాలో మంగళవారం అత్యధికంగా రాయికల్ మండలం అల్లిపూర్, వెల్గటూర్, బుగ్గారం మండలం సిరికొండ, ఎండపల్లి మండలం మారేడుపల్లి, ధర్మపురి మండలం జైన, సారంగాపూర్ మండలాల్లో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల, బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూర్ మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 18, 2025
నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి: కలెక్టర్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు.
News March 18, 2025
NTR: ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అటవీ శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు.
News March 18, 2025
చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.