News February 19, 2025
జగిత్యాల జిల్లా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 35,281 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా.. అందులో 21,667 మంది పురుషులు, 13,614 మంది మహిళలు ఉన్నారు. అలాగే జిల్లాలో మొత్తం 1769 మంది టీచర్స్ ఓటర్లు ఉండగా.. అందులో 1,232 మంది పురుషులు, 537 మంది మహిళలు ఉన్నారు.
Similar News
News July 5, 2025
పాడేరు: మెగా పేరెంట్స్&టీచర్స్ మీట్కు నిధులు విడుదల

అల్లూరి జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్స్&టీచర్స్ మీట్(పీటీఎం)కు రూ.3.05 కోట్లు విడుదలయ్యాయని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలిపారు. 30 మంది విద్యార్థులు ఉన్న స్కూల్కు రూ.10వేలు, 100 మంది ఉంటే రూ.25వేలు, 250 మంది ఉంటే రూ.50 వేలు, 500 మంది ఉంటే రూ.75 వేలు, 500కి పైబడి విద్యార్థులు ఉన్న స్కూల్స్కు రూ.లక్ష చొప్పున కేటాయించారన్నారు.
News July 5, 2025
నిర్మల్: అటవీ గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాల కల్పన

జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ కమిటీ (DLC) సమావేశం నిర్వహించారు. మొత్తం 16 రహదారి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించగా, అందులో 9 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని, మిగతా 7 ప్రాజెక్టుల నివేదికలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.
News July 5, 2025
కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.