News February 10, 2025
జగిత్యాల: తిమ్మాపూర్లో క్షుద్ర పూజల కలకలం!

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో స్థానిక తెలంగాణ విగ్రహం కూడలిలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్టు స్థానికులు తెలిపారు. పిల్లలు ఈ దారిగుండా రోజు పాఠశాలకు వెళ్తారు. ఈ చర్యను చూసి పిల్లలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయితీని కోరుతున్నారు.
Similar News
News April 5, 2026
ఆదుకొన్న నితీశ్, క్లాసెన్.. SRH స్కోర్ ఎంతంటే?

LSGతో జరుగుతున్న మ్యాచ్లో టాపార్డర్ కుప్పకూలినా SRH 156/9 స్కోర్ చేసింది. 7.1 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, ఐదో వికెట్కు క్లాసెన్(62), నితీశ్(56) 116 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్ 7, అభిషేక్ 0, ఇషాన్ 1, లివింగ్స్టోన్ 14 విఫలమయ్యారు. షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ తలో 2, దిగ్వేశ్, సిద్ధార్థ్ చెరో వికెట్ తీశారు.
News April 5, 2026
మెడలు పట్టి గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదు: ఈటల

TG: తాను BRSలోకి వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఎలాంటి తప్పు చేయకున్నా మెడలు పట్టి బయటకు గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదన్నారు. తనను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే BRS నుంచి బర్తరఫ్ చేశారని, అధికార బలంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు కరీంనగర్లో కొందరు పోస్టర్లు వేయడం బాధించిందన్నారు.
News April 5, 2026
జిల్లలో తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు: ఎస్ఈ

కర్నూల్ జిల్లా గోకులపాడులో పీఎం సూర్య ఘర్ ఉత్సవ్ను విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూల్ జిల్లాలో 23,077 గృహాలకు మంజూరు కాగా, తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.


