News January 26, 2025

జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

Similar News

News November 11, 2025

కర్నూలు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన షెడ్యూల్..!

image

ఈ నెల 12న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

News November 11, 2025

దేవుడి గురించి అడిగిన ధర్మరాజు

image

యుధిష్టిర ఉవాచ :
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం|
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
భావం: లోకంలో దైవమనగా నేమి? ప్రధానమైన ఉత్తమ గమ్యస్థానం ఏది? ఏ దేవుని స్తుతించుట వల్ల, పూజించుట వల్ల మానవులు శుభాలను పొందుతారు.
ఈ శ్లోకం భగవంతుని ఏకత్వాన్ని, మానవ జీవితానికి లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను తెలుపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>