News September 15, 2025

జగిత్యాల: ‘పీఏసీఎస్ పదవీకాలం పొడిగించాలి’

image

జగిత్యాల జిల్లాలోని 23 పీఎసీఎస్ సొసైటీల బోర్డుల పదవీకాలం పొడిగించాలని కోరుతూ జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌కు సోమవారం బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. బోర్డుల పదవీకాలం ముగిసినందున కొత్త ఎన్నికలు జరిగే వరకు చైర్మన్లు, డైరెక్టర్లను కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 15, 2025

అనకాపల్లి పోలీస్ ప్రజావేదికలో 40 ఫిర్యాదులు

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు 40 ఫిర్యాదులను అందజేశారు. ఎస్పీ తుహీన్ సిన్హా ఫిర్యాదారులతో మాట్లాడారు. 23 భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు, నాలుగు కుటుంబ కలహాల ఫిర్యాదులు, మోసాలకు సంబంధించినవి మూడు, ఇతర విభాగాలకు చెందినవి 10 ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీటిపై విచారణ నిర్వహించి వారం రోజుల లోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు

News September 15, 2025

భారత్-పాక్ మ్యాచ్‌.. ICCకి PCB ఫిర్యాదు

image

భారత్‌, పాక్ మధ్య నిన్నటి మ్యాచ్‌లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ తీరును ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తి రూల్స్ ఉల్లంఘించారని, తక్షణమే టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించడంలో ఆలస్యం చేశారని తమ డైరెక్టర్ ఉస్మాన్‌ను సస్పెండ్ చేసింది. టాస్ సమయంలో IND కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌కు రిఫరీ చెప్పారని PCB ఆరోపిస్తోంది.

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.