News January 29, 2025
జగిత్యాల: పెండింగ్ పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

వసతి గృహాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మైనార్టీ శాఖపై సమీక్ష నిర్వహించారు.ఇందులో భాగంగా వసతిగృహాల్లో మరమ్మతుల కోసం కేటాయించిన నిధులను ఏ మేరకు వినియోగించారని శాఖల వారీగా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, మెనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషనల్ గౌతమ్ రెడ్డి తదితరులున్నారు.
Similar News
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.
News November 16, 2025
GNT: పవన్ కళ్యాణ్పై అంబటి సెటైరికల్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీమంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా చురకలంటించారు. “విశాఖ CIIసమ్మిట్లో చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేంటబ్బ.?’ అంటూ అంబటి పోస్ట్ చేశారు. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు అంబటిపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News November 16, 2025
MBNR:U-14,19..17న వాలీబాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 19 విభాగాల్లో బాల, బాలికలకు బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 17న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ పత్రాలతో ఉ.9:00 గంటలలోపు పీడీ శైలజకు రిపోర్ట్ చేయాలన్నారు.SHARE IT.


