News September 5, 2024
జగిత్యాల: పెళ్లైన 17 రోజులకే నవ వధువు ఆత్మహత్య
పెళ్లైన 17 రోజులకే నవ వధువు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. SI నరేశ్ ప్రకారం.. మల్యాల మం. మ్యాడంపల్లికి చెందిన ఉదయ్కిరణ్కు తక్కళ్లపల్లికి చెందిన భాగ్యలక్ష్మితో ఆగస్టు 18న పెళ్లయింది. కాగా, ఉదయ్ HYDలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు భాగ్యలక్ష్మిని స్వగ్రామం తీసుకురాగా ‘నేను ఎవరి కారణంగా చనిపోవట్లేదు.. నాకే ఈ లోకంలో ఉండటం ఇష్టం లేదు’ అని చేతిపై రాసి ఉరేసుకుంది.
Similar News
News October 6, 2024
నంది గరతుమంతుడి వాహనంపై ఊరేగిన రాజన్న
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారంరాత్రి స్వామి నంది గరుత్మంతుడి వాహనంపై విహరించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.
News October 6, 2024
కరీంనగర్: 21 ఆసుపత్రులకు గుర్తింపు
కరీంనగర్ జిల్లాలో 21 ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లాలో అందుతున్న ఆరోగ్య సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. ఇందులో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కాయకల్పకు ఎంపిక కావడం జరిగింది. మోతాజాఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంకు బెస్ట్ అవార్డు, బుట్టిరాజారాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం కమండేషన్ విభాగంలో కాయకల్ప గుర్తింపు దక్కించుకొని అవార్డుకు ఎంపికైంది.
News October 6, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాక జయంతి వేడుకలు.
@ కథలాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్.
@ కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు.
@ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనును కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్.