News August 26, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన పలువురి నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 26, 2025
గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.
News August 26, 2025
ఆ మ్యాచుల ఫలితం మార్చాలనుకుంటా: ద్రవిడ్

టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో మాజీ కోచ్ ద్రవిడ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే తాను ఆడిన ఓ 2 మ్యాచుల ఫలితాలు మార్చాలని ఉందన్నారు. టెస్టుల్లో 1997లో వెస్టిండీస్తో బార్బడోస్ టెస్ట్లో పరాజయం, 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి రిజల్ట్స్ను మార్చాలని కోరుకుంటానని అభిప్రాయపడ్డారు. ప్లేయర్గా ద్రవిడ్కు WC కలగానే మిగిలినా కోచ్గా 2024 టీ20 వరల్డ్ కప్ అందుకున్నారు.
News August 26, 2025
ఆగస్టు 26: చరిత్రలో ఈ రోజు

1910: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జననం(ఫొటోలో)
1920: కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం
1963: సినీ నటుడు సురేశ్ జననం
1982: దేశంలో తొలి ఓపెన్ యూనివర్సిటీ డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ప్రారంభం
* మహిళా సమానత్వ దినోత్సవం
* అంతర్జాతీయ కుక్కల దినోత్సవం