News March 17, 2025

జగిత్యాల: ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 35 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వాటిని ఆలస్యం చేయకుండ పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవోలు మధు సుధన్, జీవాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 22, 2025

భద్రాద్రి: అరుదైన ఆపరేషన్.. అభినందించిన ఎమ్మెల్యే, కలెక్టర్

image

కొత్తగూడెంలో నూడిల్స్ బండి నడిపే పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిశాల్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లోతుగా తెగడంతో ఆశలు వదులుకున్నారు. గొంతు స్పెషలిస్ట్ డా.రవిబాబు 2 గంటలు శ్రమించి పాల్వంచ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. భద్రాచలం ఐసీయూలో రెండు వారాలు చికిత్స అందించి సోమవారం డిశ్చార్జ్ చేశారు. రవిబాబుతో పాటు పాల్వంచ, భద్రాచలం ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

News December 22, 2025

వివాదాలపై వెంటనే చర్యలు తీసుకోండి : SP

image

అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమంలో భాగంగా SP ధీరజ్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సివిల్, కుటుంబ, ఆస్తి వివాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగుల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

News December 22, 2025

PGRSకు 27 అర్జీలు: SP రాహుల్ మీనా

image

అమలాపురం: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 27 సమస్యలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ రాహుల్ మీనాను కలిసి తమ సమస్యలను లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.