News February 17, 2025
జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద గంగు(72) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్య మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గంగు శనివారం రాత్రి తన ఇంటిలో టీ తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నవీన్ చెప్పారు.
Similar News
News December 29, 2025
భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్పై పాక్ నిషేధం

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.
News December 29, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే పశుగ్రాసాలివి

పాడి పశువుల పోషణలో, పాల ఉత్పత్తిలో పచ్చి పశుగ్రాసానిది కీలక పాత్ర. అధిక పోషకాలు, మాంసకృత్తులతో కూడిన గడ్డి వల్ల జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి, పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే దాణాతో పాటు ఎండు, పచ్చి గడ్డిని పశువులకు అందించాలి. పాడి పోషణలో ప్రసిద్ధి చెందిన 4G బుల్లెట్ సూపర్ నేపియర్, సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, జూరీ గడ్డిని ఎలా పెంచాలి? వీటితో లాభమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 29, 2025
రైలు అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరం: హోంమంత్రి

ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ట్రైన్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.


