News December 14, 2025
జగిత్యాల: ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు

జగిత్యాల జిల్లాలో రెండో విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బీర్పూర్ మండలంలో 80.25%, జగిత్యాల అర్బన్ మండలంలో 81.26%, జగిత్యాల రూరల్ మండలంలో 77.69%, కొడిమ్యాల మండలంలో 78.43%, మల్యాల మండలంలో 77.06%, రాయికల్ మండలంలో 79.11%, సారంగాపూర్ మండలంలో 77.61% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా జిల్లాలోని ఏడు మండలాల్లో 78.34% ఓటింగ్ నమోదయిందన్నారు.
Similar News
News December 16, 2025
ఎన్నికల బందోబస్తుకు 570 మంది పోలీసులు: ఎస్పీ సంకీర్త్

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి (MCC) అమలులో ఉంటుందని తెలిపారు.
News December 16, 2025
టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేరును పార్టీ అధిష్టానం మంగళవారం ఖరారు చేసింది. కార్యదర్శిగా శ్రీనివాస్ బాబా పేరును ప్రకటించారు. అయితే ఎంపీ సానా సతీశ్ ఈ పదవికి తోట నవీన్ పేరును సిఫార్సు చేయగా, అధిష్టానం జ్యోతుల నవీన్ను ఎంపిక చేయడం గమనార్హం. వీరిద్దరూ పాతపారే కావడం విశేషం. దీంతో ఎంపీ సతీశ్ నిరాశలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
News December 16, 2025
ములుగు కలెక్టర్ ప్రొఫైల్తో ఫేక్ వాట్సాప్ సందేశాలు

ఫేక్ వాట్సాప్ సందేశాలను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. తన ఫొటోను ప్రొఫైల్గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ అధికారులకు వ్యక్తులకు సందేశాలు పంపి డబ్బులు అడుగుతున్నారన్నారు. ఇలాంటి నకిలీ సందేశాలు అందిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు, సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.


