News September 23, 2025

జగిత్యాల: ‘బాధితులకు సత్వర న్యాయం అందించాలి’

image

ప్రజల సౌకర్యార్థం సోమవారం జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ స్వయంగా పాల్గొని 8 మంది అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పొందుపరచి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News September 23, 2025

సంగారెడ్డిలో హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డులకు జాకెట్స్, రెయిన్ కోట్లను సోమవారం పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్యూటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 23, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 23, 2025

మెదక్: ‘అధిక యూరియాతో పంటలకు తెగుళ్లు’

image

మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్‌లోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద యూరియా సరఫరాను ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి, ఖర్చులు పెరిగిపోతాయని, రాబడి తగ్గుతుందని రైతులకు వివరించారు.