News April 12, 2025

జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన

image

జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రాం విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం స్థలం పరిశీలించారు. మహానేత బాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని.. ప్రజల కోరిక మేరకు పట్టణంలో ప్రభుత్వా నిబంధనల మేరకు విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News November 4, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

image

సత్యసాయి (D) చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐచర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.

News November 4, 2025

బియ్యం స్మగ్లింగ్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: జేసీ

image

ఏలూరు జిల్లాలో పీడీఎస్‌ బియ్యం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. హమాలీలు, రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్‌లోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సోమవారం ఆయన సూచించారు. ధాన్యం రవాణాలో లారీ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు మంచి ఫలితాలు సాధించాలని జేసీ అభిషేక్ గౌడ ఆకాంక్షించారు.

News November 4, 2025

VZM: ఈ సంక్రాంతికీ కష్టాలు తప్పేలా లేవు..!

image

ఉత్తరాంధ్ర వలస జీవులకు ఈ ఏడాదీ సంక్రాంతి కష్టాలు తప్పేలా లేవు. చెన్నై, బెంగళూరు, HYD, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే వారు సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకుంటారు. ఆయా ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు రైళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో బస్సులను ఆశ్రయించేవారు. అయితే ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు స్త్రీశక్తి పథకం కారణంగా బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. రైళ్ల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.