News December 16, 2025

జగిత్యాల: బీడీ కార్మికురాలు.. ప్రథమ పౌరురాలు..!

image

బీడీలు చూడుతూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ గ్రామానికి ప్రథమ పౌరురాలైంది. మల్యాల(M) గొర్రెగుండం గ్రామానికి చెందిన సుంకే అంజలి బీడీ కార్మికురాలు కాగా, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచి సర్పంచిగా విజయం సాధించారు. అలాగే మండలంలోని మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన గాతం అంజయ్య కూలీ పనులు చేస్తూ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్ అయ్యారు. ప్రజలకు సేవ చేయాలనే వీరి సంకల్పం, శ్రమకు విజయం దాసోహం అయింది.

Similar News

News December 16, 2025

సంగారెడ్డి: 3వ విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

3వ విడతలో కల్హేర్, కంగ్టి, మనూర్, నాగలిగిద్ద, NKD, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 16, 2025

VZM: ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల

image

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్‌లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.

News December 16, 2025

ADB: సోషల్‌ మీడియాపై నిఘా: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై పోలీసులు నిఘా ఉంచారని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100కు తెలియజేయాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని, ఎన్నికలు పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.