News March 16, 2025
జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.
Similar News
News February 24, 2026
HYD: షాకింగ్! 13ఏళ్ల బాలికకు గుండెపోటు

వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలిలా.. ఆగపల్లి గ్రామస్థుడు లకుమళ్ల యాదవరావు కూతురు నిహారిక(13) ఛాతిలో నెప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులో హాట్ఎటాక్తో మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
News February 24, 2026
ఇండియా-బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షడిగా మిథున్ రెడ్డి

18వ లోక్ సభలో ఇండియా-బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్లిప్ గ్రూప్ అధ్యక్షుడిగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈయన్ను భారత పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లా 2026లో ఏర్పాటు చేసిన పార్లమెంట్రీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సిస్టంలో ఒకరిగా బాల్టిక్ దేశాల గ్రూప్కు నామినేట్ చేశారు. అంటే ఆయన బాల్టిక్ ప్రాంతం (Estonia, Latvia, Lithuania)తో సంబంధాలు బలోపేతం చేసేందుకు కషి చేస్తారు.
News February 24, 2026
ఏలూరు జిల్లాలో 98 శాతం ఇంటర్ పరీక్షలు

ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.


