News March 16, 2025
జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.
Similar News
News January 3, 2026
సిరిసిల్ల: 76 మంది చుక్కేసి.. చిక్కారు..!

నూతన సంవత్సర సందర్భంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. అన్ని పోలీసుల పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. 76 మంది మద్యం తాగి వాహనాలు నడపడంతో కేసులు నమోదు చేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్టేషన్కు తరలించారని వెల్లడించారు.
News January 3, 2026
6న పార్వతీపురంలో జాబ్ మేళా.. 561 ఖాళీలకు ఇంటర్వ్యూలు

పార్వతీపురం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 6న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి R.వహీదా శుక్రవారం తెలిపారు. మొత్తం 9 కంపెనీల్లో 561 ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు కలిగి పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన స్త్రీ, పురుషులు అర్హులన్నారు. ఆసక్తిగల, అర్హతలున్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 3, 2026
మంచిర్యాల: ఆ మున్సిపాలిటీకి ఎన్నికలెప్పుడు..?

మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడి 3 దశాబ్దాలవుతున్నా నేటికీ ఎన్నికలు జరగకపోవడం గమనార్హం. 1995లో మున్సిపాలిటీ ఏర్పడినా రిజర్వేషన్ల వివాదంతో 1998లో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు ఆగిపోయాయి. అప్పటి నుంచి త్రిసభ్య కమిటీ పాలనలోనే కాలం వెళ్లదీస్తోంది. ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వాలు హామీలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి.


