News February 13, 2025
జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.
Similar News
News November 11, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా(<
News November 11, 2025
VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు అప్లై చేశారా?

సఫాయి కర్మచారి యువతకు 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై ఇవ్వనున్నారు.
➤యూనిట్ విలువ: రూ.31,67,326
➤సబ్సిడీ: రూ.14,16,831
➤రుణ మొత్తం: రూ17,50,495, వడ్డీ రేటు: 6%
➤చెల్లింపు కాలం: 72 నెలలు (ప్రతి నెల రూ.33,064 వాయిదా)
➤గ్రూప్: 5 మంది అభ్యర్థులు ఉండాలి
➤అప్లై చేసే స్థలం: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం
➤చివరి తేదీ: 20-11-2025
News November 11, 2025
ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం: కలెక్టర్

జిల్లాలో పంట నష్టాలను తగ్గించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా సిల్వర్ ఓక్కు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. కాఫీ తోటలను తెగుళ్ల బెడద నుంచి రక్షించేందుకు అవకాడో, లిచీ, జాక్ ఫ్రూట్, స్వీట్ ఆరంజ్ వంటి విలువైన పంటలను ప్రోత్సహించాలన్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పంటలే లక్ష్యం అన్నారు.


